గత విచారణలో హైకోర్టు స్టే ఇవ్వలేదని అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని వారు తెలిపారు. అయితే స్టే రాకపోతే పిటిషన్ వేస్తారా…హైకోర్టులో విచారణలోఉన్న అంశం పైతాము ఎలా విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పిటిన్ ను కొట్టి వేసింది.

రిజర్వేషన్లను పెంచుతూ జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. వెంటనే స్థానిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసింది. అందులో రిజర్వేషన్లను బీసీలకు 42 శాతం కేటాయిం చారు.

ఈ కేటాయింపు వల్ల సుప్రీంకోర్టు నిర్దేశించిన యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి దాటిపోతోందని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది.

అప్పటికి షెడ్యూల్ విడుదల కాలేదు. అందుకే ఎలాంటి స్టే ఇవ్వలేదు.ఈ కారణం చెప్పి పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఎనిమిదో తేదీన హైకోర్టులో జరగబో యే విచారణే కీలకo